Revanth Reddy వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఫైర్‌

ABN , First Publish Date - 2021-09-18T23:21:09+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. మద్యానికి సీఎం కేసీఆర్, డ్రగ్స్‌కు కేటీఆర్ బ్రాండ్

Revanth Reddy వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఫైర్‌

హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. మద్యానికి సీఎం కేసీఆర్, డ్రగ్స్‌కు కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్లన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. డ్రగ్స్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమని సవాల్ విసిరారు. అవసరమైతే తన రక్తం, వెంట్రుకలను కూడా టెస్టులకు ఇస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా నాలాగే శాంపిల్స్ ఇస్తారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.


శుక్రవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గజ్వేల్‌లో నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా ముగింపు సభలో కేసీఆర్, కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ తాగుబోతులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారితే.. ఆయన తనయుడు డ్రగ్స్‌ అమ్మకాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ చిన్నారిని పాశవికంగా హత్య చేసి చంపిన వాడిని ఏడు రోజుల్లో కూడా పట్టుకోకుండా ఉన్న పోలీసులు చేతగాని దద్దమ్మల్లా వ్యవహరించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Updated Date - 2021-09-18T23:21:09+05:30 IST