సంజయ్ పాదయాత్రను అడ్డుకునే ఖర్మ మాకు పట్టలేదు: కేటీఆర్
ABN , First Publish Date - 2022-04-18T22:57:46+05:30 IST
బండి సంజయ్కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.
హైదరాబాద్: బండి సంజయ్కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. సోమవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నీ పాదయాత్రను అడ్డుకునే ఖర్మ మాకు పట్టలేదు.ఏ మొఖం పెట్టుకొని పాలమూరులో పాదయాత్ర చేస్తున్నావు. బండి సంజయ్ ఒక్కసారి రాయ చూర్ వెళ్లి చూడు.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయా లేదో కనుక్కోవాలి.కర్ణాటకలో కాంట్రాక్టర్లు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.నీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఏన్ని పైసలు ఇచ్చింది.దమ్ముంటే దేశమంతా ఉచిత విద్య, వైద్యం ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఇవ్వమను.ప్రైవేట్ విద్యా సంస్థలు, ఆస్పత్రులు రద్దు చేయమను మేము మద్దతు ఇస్తం. డొల్లమాటలు, సొల్లు పురాణం కట్టిపెట్టు. కాంగ్రెస్ నేత మానిక్కం ఠాగూర్ను పొత్తు కావాలని ఎవరు అడిగారు’’ అని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.