వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేలా ప్లీనరీలో వ్యూహ రచన చేస్తాం: కేటీఆర్
ABN , First Publish Date - 2022-04-26T21:48:23+05:30 IST
ఈసారి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ మూడోసారి అఖండ విజయంతో గెలిచి హ్యాట్రిక్ కొట్టేలా ప్లీనరీలో వ్యూహరచన చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్: ఈసారి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ మూడోసారి అఖండ విజయంతో గెలిచి హ్యాట్రిక్ కొట్టేలా ప్లీనరీలో వ్యూహరచన చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం HICCలో రేపటి ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవం సభ రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందన్నారు ఈ సభకు ఆహ్వానం ఉన్నవారు మాత్రమే హాజరుకావాలన్నారు. 60 లక్షల మంది సైన్యం ఉన్న పార్టీ.. అందరికీ ప్లీనరీలో పాల్గొనే అవకాశం దొరకదన్నారు. ఎంపిక చేయబడిన వారిని మాత్రమే ప్లీనరీకి ఆహ్వానించామన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలా ప్లీనరీలో ఎజెండా రూపొదించామన్నారు. దేశానికే తెలంగాణ దిక్సూచిగా మారుతోందన్నారు. పెరుగుతున్న ధరలపై సామాన్యుడి గళం వినిపించేలా ప్లీనరీలో తీర్మానాలు చేస్తామన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.