అడ్డగోలుగా మాట్లాడితే తాట తీస్తాం.. కేటీఆర్ను హెచ్చరించిన సంపత్
ABN , First Publish Date - 2021-07-09T21:20:51+05:30 IST
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత సంపత్ కుమార్ మాట్లాడుతూ.. కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడటం సరికాదన్నారు. మరోసారి రేవంత్పై అడ్డగోలుగా మాట్లాడితే తాట తీస్తామని హెచ్చరించారు. సోనియా తెలంగాణ ఇవ్వడం వల్లే.. ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారని సంపత్ కుమార్ అన్నారు. కేటీఆర్కు ధైర్యం ఉంటే ఫిరాయింపులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.