కేటీఆర్‌ ప్రకటన సిగ్గుచేటు: ఎంపీ కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2020-07-07T07:29:09+05:30 IST

ఫార్మాసిటీ కోసం రైతులకు ఎకరాకు రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల పరిహారం అందించామని మంత్రి కేటీఆర్‌ తప్పుడు ప్రకటన చేయడం సిగ్గుచేటని

కేటీఆర్‌ ప్రకటన సిగ్గుచేటు: ఎంపీ కోమటిరెడ్డి

యాచారం, జూలై 6: ఫార్మాసిటీ కోసం రైతులకు ఎకరాకు రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల పరిహారం అందించామని మంత్రి కేటీఆర్‌ తప్పుడు ప్రకటన చేయడం సిగ్గుచేటని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా తాడిపర్తిలో సోమవారం జరిగిన ఫార్మాసిటీ భూ నిర్వాసితుల సమావేశంలో వెంకట్‌రెడ్డి మాట్లాడారు. బడా కంపెనీలకు రూ.వేల కోట్ల విలువైన భూములను ప్రభుత్వం ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. ఫార్మాసిటీ ఏర్పాటుపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు వేస్తానని చెప్పారు. సీఎంకు దమ్ముంటే ఇదే ఫార్మాసిటీని తన సొంత జిల్లాలో ఏర్పాటు చేసుకోవచ్చు కదా? అని అన్నారు.

Updated Date - 2020-07-07T07:29:09+05:30 IST