దివ్యసాకేతంలో ముగిసిన కూచిపూడి నృత్య ప్రదర్శన
ABN , First Publish Date - 2021-10-25T05:21:53+05:30 IST
దివ్యసాకేతంలో ముగిసిన కూచిపూడి నృత్య ప్రదర్శన
శంషాబాద్ రూరల్: ముచ్చింతల్ శ్రీరామనగరం దివ్యసాకేతంలో వెంపటి చినసత్యం జయంతి ఉత్సవాలను పురస్కరింకొని మూడు రోజులుగా నిర్వహించిన కూచిపూడి నాట్యోత్సవాలు ఆదివారం ముగిశాయి. సేవ్ కూచిపూడి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖల అధ్వర్యంలో నిర్వహించి ముగింపు కార్యక్రమానికి అధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్స్వామి హాజరయ్యారు. ప్రొఫెసర్ అనురాధ, మరికొందరు ప్రముఖలకు పద్మశ్రీ శోభానాయుడు జీవిత పురస్కారాన్ని చినజీయర్స్వామి అందజేశారు. కూచిపూడి కళాకారులను స్వామిజీ అభినందించారు. అహోబిల జీయర్స్వామి, దేవానాథ జీయర్స్వామి, పలువురు ప్రముఖలు పాల్గొన్నారు.