The sea: కుమరిలో ‘అల’జడి

ABN , First Publish Date - 2022-08-03T17:13:18+05:30 IST

కన్నియాకుమారి(Kanniyakumari) సముద్రతీరం పొడవునా మంగళవారం వేకువజాము నుంచి అలల ఉధృతి అధికంగా ఉండటంతో జాలర్లు చేపలవేట

The sea: కుమరిలో ‘అల’జడి

                            - చేపల వేటకు వెళ్ళని జాలర్లు


చెన్నై, ఆగస్టు 2 (ఆంథ్రజ్యోతి): కన్నియాకుమారి(Kanniyakumari) సముద్రతీరం పొడవునా మంగళవారం వేకువజాము నుంచి అలల ఉధృతి అధికంగా ఉండటంతో  జాలర్లు చేపలవేటకు వెళ్లలేదు. గత రెండు రోజులుగా కన్నియాకుమారిలో సముద్రంలో అలల తాడికి అధికంగా ఉంటోంది. తీరంలో రాక్షస అలలు పదడుగుల ఎత్తున ఎగసి పడుతున్నాయి. మంగళవారం వేకుజామున జాలర్లు చేపలవేటకు సిద్ధమవుతుండటా అలల తాకిడి అధికమైంది. తీరమంతా పెనుగాలలు(Big waves) వీచాయి. దీంతో ఆ జిల్లాలో సుమారు 50 వేలమంది జాలర్లు చేపలవేట(fishing) మానుకున్నారు. మరో రెండు రోజులపాటు కన్నియాకుమారి జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని, సముద్రంలో పెనుగులు వీస్తాయని జాలర్లు చేపలవేటకు వెళ్ళకూదని స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2022-08-03T17:13:18+05:30 IST