ప్రత్యేక జిల్లాగా కుంభకోణం

ABN , First Publish Date - 2022-02-12T14:00:07+05:30 IST

కుంభకోణం ప్రాంతాన్ని త్వరలో ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తామని డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ హామీ ఇచ్చారు. కుంభకోణం కార్పొరేషన్‌లో పోటీచేస్తున్న డీఎంకే, మిత్రపక్షాల

ప్రత్యేక జిల్లాగా కుంభకోణం

                           - ఎమ్మెల్యే ఉదయనిధి హామీ


ప్యారీస్‌(చెన్నై): కుంభకోణం ప్రాంతాన్ని త్వరలో ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తామని డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ హామీ ఇచ్చారు. కుంభకోణం కార్పొరేషన్‌లో పోటీచేస్తున్న డీఎంకే, మిత్రపక్షాల అభ్యర్థులకు మద్దతుగా ఉదయనిధి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్షాల నేతలు తాను కనిపించడం లేదని చేస్తున్న విమర్శలు వాస్తవం కాదన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో డీఎంకే కూటమి తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా తాను ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఉదయనిధి తెలిపారు. తంజావూరు జిల్లాలో పెద్ద నగరంగా గుర్తింపు పొందిన కుంభకోణంలో మౌలిక వసతులు మెరుగుపరచే పనులు జరుగుతున్నాయని, కుంభకోణం కేంద్రంగా త్వరలో ప్రత్యేక జిల్లా ఆవిర్భవించనుందని ఆయన తెలిపారు.

Updated Date - 2022-02-12T14:00:07+05:30 IST