టీడీపీ నేత కూనరవి సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-07-20T01:11:29+05:30 IST
టీడీపీ నేత కూనరవి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తరహాలోనే ఏపీలో కూడా త్వరలో అధికార మార్పిడి ఉంటుందన్నారు.
అమరావతి: టీడీపీ నేత కూనరవి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తరహాలోనే ఏపీలో కూడా త్వరలో అధికార మార్పిడి ఉంటుందన్నారు. దీనికి మంత్రి పెద్దిరెడ్డి నాయకత్వం వహించబోతున్నారని పేర్కొన్నారు. ఏపీలో బీజేపీ అధికార మార్పిడికి సహకరిస్తుందని కూనరవి చెప్పారు. నిన్న జరిగిన సమావేశంలో చాలా మంది ఎమ్మెల్యేలు సీఎం వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారని ఆరోపించారు.