కరోనా నుంచి కోలుకున్న కూనంనేని.. హైదరాబాద్‌ నుంచి ఇంటికి..

ABN , First Publish Date - 2020-08-07T19:50:24+05:30 IST

కరోనా బారిన పడి హైదరాబాద్‌ ఆసుపత్రిలో చేరిన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోలుకున్నారు.

కరోనా నుంచి కోలుకున్న కూనంనేని.. హైదరాబాద్‌ నుంచి ఇంటికి..

కొత్తగూడెం(ఖమ్మం): కరోనా బారిన పడి హైదరాబాద్‌ ఆసుపత్రిలో చేరిన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోలుకున్నారు. వారం రోజుల క్రితం భద్రాద్రి జిల్లా కేంద్ర కొత్తగూడెంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ రావడంతో ఆయన హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందిన అనంతరం మరో మారు పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ రావడంతో గురువారం ఆ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ కొత్తగూడెంలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కూనంనేని పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆయన తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలిపారు. పేదప్రజలు సరైన వైద్యం అందక కరోనాతో తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారని, ప్రజల ప్రాణాలు కాపాడటానికి ప్రభుత్వం వైద్య సేవలను మరింత విస్తృతం చేయాలని కోరారు. కరోనా విషయంలో భయపకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

Updated Date - 2020-08-07T19:50:24+05:30 IST