AP News: కుప్పం ఘటన శాంతిభద్రతలను ఇబ్బందిపెట్టేంత పెద్దదికాదు: డీజీపీ
ABN , First Publish Date - 2022-09-02T23:52:36+05:30 IST
కుప్పం (Kuppam) ఘటన శాంతిభద్రతలను ఇబ్బందిపెట్టేంత పెద్దదికాదని డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి (DGP Rajendranath Reddy) తోచిపుచ్చారు.
అమరావతి: కుప్పం (Kuppam) ఘటన శాంతిభద్రతలను ఇబ్బందిపెట్టేంత పెద్దదికాదని డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి (DGP Rajendranath Reddy) తోచిపుచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుప్పం ఘటనలో పాల్గొన్నవారు స్థానికులేనని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)కు ఎన్ఎస్జీ సెక్యూరిటీ పెంచడం, తగ్గించడం అనేది.. వచ్చే ఇన్పుట్స్పై ఆధారపడి ఉంటుందన్నారు. సెక్యూరిటీ పెంచడం, తగ్గించడంలో నిజాలు ఎంతో తెలియదని చెప్పారు. ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) వీడియోపై సీఐడీ (CID) విచారిస్తోందని తెలిపారు. సెప్టెంబర్ 11న సీపీఎస్ ఉద్యోగుల సమ్మెపై ఎలాంటి విజ్ఞప్తి రాలేదని తెలిపారు. అభ్యర్థన వచ్చాకా అనుమతివ్వాలా.. వద్దా అనేది చెబుతామన్నారు. ఉద్యోగులను అరెస్ట్ చేయలేదని బైండోవర్ చేశామని రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. కుప్పంలో టీడీపీ నేతలు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో కుప్పంలో కేసులు నమోదు చేశామని చిత్తూరు ఎస్పీ తెలిపారు.