కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్: మంత్రి పెద్దిరెడ్డి
ABN , First Publish Date - 2022-07-01T09:17:07+05:30 IST
కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్: మంత్రి పెద్దిరెడ్డి
పలమనేరు, జూన్ 30: చిత్తూరు జిల్లా కుప్పంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ, చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భరత్ పోటీ చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం గంగవరం మండలంలో జరిగిన వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ భరత్ పోటీ విషయాన్ని స్పష్టం చేశారు.