నేడు దేవరగట్టులో కర్రల సమరం రద్దు

ABN , First Publish Date - 2020-10-26T12:38:12+05:30 IST

ప్రతీ సంవత్సరం జిల్లాలోని దేవరగట్టులో జరిగే కర్రల సమరం రద్దు అయ్యింది.

నేడు దేవరగట్టులో కర్రల సమరం రద్దు

కర్నూలు: ప్రతీ సంవత్సరం జిల్లాలోని దేవరగట్టులో జరిగే కర్రల సమరం రద్దు అయ్యింది. కరోనా కారణంగా కర్రల యుద్ధం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అయితే కర్రల సమరం నిర్వహిస్తామని యువకులు చెబుతున్నారు. కాగా దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. దేవరగట్టుకు బయటి వ్యక్తులకు నో ఎంట్రీ ఉంది. దేవరగట్టులో పూజా కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. దేవరగట్టు పరిసర గ్రామాల్లో మద్యం అమ్మకాలను నిషేధించారు. ఈరోజు అర్ధరాత్రి మాలమల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం జరుగనుంది. మరోవైపు దేవరగట్టులో కర్రల సమరం రద్దు  నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 1500 మంది పోలీసులు దేవరగట్టు విధుల్లో ఉన్నారు. దేవరగట్టు ఆలయ పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రోన్, ఫాల్కాన్ వాహనాలతో నిఘా నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2020-10-26T12:38:12+05:30 IST