కర్నూలులో మాజీ ఎమ్మెల్యే జనార్ధన్రెడ్డి ధర్నా
ABN , First Publish Date - 2021-01-16T18:59:22+05:30 IST
జిల్లాలోని బనగానపల్లెలో యనకండ్ల వాగును పూడ్చి వేసి ప్రభుత్వ భూమి ఆక్రమించిన ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్రెడ్డి ధర్నాకు దిగారు.
కర్నూలు: జిల్లాలోని బనగానపల్లెలో యనకండ్ల వాగును పూడ్చి వేసి ప్రభుత్వ భూమి ఆక్రమించిన ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్రెడ్డి ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో బనగానపల్లె - నంద్యాల మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు.