AP News: కర్నూలులో దుకాణాల తొలగింపుకు యత్నం... ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-09-07T20:34:12+05:30 IST

జిల్లాలోని మంత్రాలయం మండలం కల్లుకుంట గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

AP News: కర్నూలులో దుకాణాల తొలగింపుకు యత్నం... ఉద్రిక్తత

కర్నూలు: జిల్లాలోని మంత్రాలయం మండలం కల్లుకుంట గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోరంబోకు భూమిలో దుకాణాలు ఏర్పాటు చేసుకొని 20 మంది గ్రామస్తులు  జీవనం సాగిస్తున్నారు. అయితే  దుకాణాలు తొలగించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జేసీబీతో వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. పదేళ్లకు పైగా దుకాణాలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నమని తెలిపారు. అయితే ఇది ప్రభుత్వ స్థలమని ఇక్కడ సచివాలయం, రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ దుకాణాదారులకు తెలిపారు. 10 రోజుల క్రితమే నోటీసులు ఇచ్చామని రెండు రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశించారు. అయితే అధికారులు, దుకాణాదారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 

Updated Date - 2022-09-07T20:34:12+05:30 IST