కర్నూలు : ఎస్బీఐ ఏటీఎమ్ చోరీకి విఫలయత్నం
ABN , First Publish Date - 2021-01-22T15:01:19+05:30 IST
కర్నూలు: నగరంలోని కోవెలకుంట్లలో ఎస్బీఐ ఏటీఎమ్ చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు.
కర్నూలు: నగరంలోని కోవెలకుంట్లలో ఎస్బీఐ ఏటీఎమ్ చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఏటీఎమ్ మిషన్ను గొడ్డలితో ద్వంసం చేశారు. అదే సమయంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం రావడంతో దుండగులు పరారయ్యారు. గమనించిన పోలీసులు లోపలకు వెళ్లి చూడగా ఏటీఎమ్ మిషన్ పాక్షికంగా దెబ్బతిన్నదని, డబ్బు చోరీ కాలేదని పోలీసులు తెలిపారు.