శ్రీశైలంలో అన్ని ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలుపుదల

ABN , First Publish Date - 2021-02-28T15:21:52+05:30 IST

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీశైలం ఆలయంలో ఆదివారం నుంచి జరిగే అన్ని..

శ్రీశైలంలో అన్ని ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలుపుదల

కర్నూలు జిల్లా: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీశైలం ఆలయంలో ఆదివారం నుంచి జరిగే అన్ని ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు దేవస్థానం ఈవో కె.ఎస్.రామరావు తెలిపారు. భక్తులకు రూ. 150, 500 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్స్ అందుబాటులో ఉంటాయన్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం తిరిగి ఆర్జిత సేవలు యధావిధిగా కొనసాగుతాయన్నారు. మార్చి 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయని ఈవో తెలిపారు.

Updated Date - 2021-02-28T15:21:52+05:30 IST