నిజాలంకరణ రూపంలో దర్శనమిస్తున్న భ్రమరాంబాదేవి

ABN , First Publish Date - 2021-10-15T15:21:44+05:30 IST

శ్రీశైలంలో శుక్రవారంతో దసరా మహోత్సవాలు ముగియనున్నాయి.

నిజాలంకరణ రూపంలో దర్శనమిస్తున్న భ్రమరాంబాదేవి

కర్నూలు: శ్రీశైలంలో శుక్రవారంతో దసరా మహోత్సవాలు ముగియనున్నాయి. దసరా మహోత్సవాలలో తొమ్మవదరోజు  భ్రమరాంబాదేవి అమ్మవారు నిజాలంకరణ రూపంలో భక్తులకు దర్శనమిస్తోంది. ఈ సాయంత్రం నంది వాహనంలో స్వామి, అమ్మవార్ల ఆలయ ప్రాకారోత్సవం, శమీపూజ జరుగుతుంది. దసరా పండుగ సందర్భంగా శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వేకువ జాము నుంచే భక్తులు క్యూ లైన్లలో నిలుచుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కరోనా నిభందనలు పాటిస్తూ భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

Updated Date - 2021-10-15T15:21:44+05:30 IST