వరుసగా మూడో ఏడాది Jagannana Vidhyakanuka ఇస్తున్నాం: సీఎం Jagan

ABN , First Publish Date - 2022-07-05T18:26:41+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లా, ఆదోని (Adoni)లో పర్యటిస్తున్నారు.

వరుసగా మూడో ఏడాది Jagannana Vidhyakanuka ఇస్తున్నాం: సీఎం Jagan

కర్నూలు (Kurnool) జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jaganmohan reddy) మంగళవారం కర్నూలు జిల్లా, ఆదోని (Adoni)లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో జగనన్న విద్యా కానుక (Jagannana Vidhyakanuka)ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో  1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రూ. 931 కోట్ల ఖర్చుతో  విద్యాకానుక కిట్లు అందజేస్తున్నామన్నారు. వరుసగా మూడో ఏడాది జగనన్న విద్యాకానుక ఇస్తున్నామన్నారు. పేదరికం నుంచి బయటపడాలంటే చదువు అవసరమన్నారు. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని చెప్పారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టామన్నారు. బైజూస్ కంపెనీతో ఒప్పందం చేసుకుని బైజూస్ యాప్ తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు.

Updated Date - 2022-07-05T18:26:41+05:30 IST