కర్నూలులో నేడు వినాయక నిమజ్జనం

ABN , First Publish Date - 2021-09-18T13:34:09+05:30 IST

కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనోత్సవం నేడు జరగనుంది. అధికారులు, గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. జిల్లా యంత్రాంగం వినాయక ఘాట్‌ వద్ద గణేశ్‌ ప్రతిమల

కర్నూలులో నేడు వినాయక నిమజ్జనం

కర్నూలు: కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనోత్సవం నేడు జరగనుంది. అధికారులు, గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. జిల్లా యంత్రాంగం వినాయక ఘాట్‌ వద్ద గణేశ్‌ ప్రతిమల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. కేసీ కెనాల్‌ వినాయక ఘాట్‌ వద్ద నిమజ్జనం జరగనుంది.  వినాయక నిమజ్జనం సందర్భంగా కర్నూలులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 2,500 మంది భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. విగ్రహాల ఊరేగింపులో డీజేలు, లౌడ్ స్పీకర్లు నిషేధించినట్లు ఎస్పీ తెలిపారు. అల్లరి మూకలపై గట్టి నిఘా పెట్టామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తెలిపారు.

Updated Date - 2021-09-18T13:34:09+05:30 IST