ఆదోనిలో రెచ్చిపోయిన దొంగలు

ABN , First Publish Date - 2022-08-27T16:26:53+05:30 IST

ఆదోనిలోని దొంగలు రెచ్చిపోయారు. గత కొన్ని రోజులుగా వరుస చోరీలు జరుగుతున్నాయి. దీంతో ఆదోనిలోని వ్యాపారలులు హడలిపోతున్నారు

ఆదోనిలో రెచ్చిపోయిన దొంగలు

Kurnool: ఆదోని(Adoni)లోని దొంగలు రెచ్చిపోయారు. గత కొన్ని రోజులుగా వరుస చోరీలు జరుగుతున్నాయి. దీంతో ఆదోనిలోని వ్యాపారలులు హడలిపోతున్నారు. ఇక..శుక్రవారం అర్ధరాత్రి కూడా దొంగలు బీభత్సం సృష్టించారు. జ్యువెలరీ షాప్‌(Jewelery shop)లో భారీ చోరీ చేశారు. షాప్‌ తాళాలు పగులగొట్టి కోట్లు విలువచేసే బంగారం నగలు, వజ్రాలు, వెండి వస్తువులు అపహరించారు. జ్యువెలరీ షాప్ యజమాని ఉదయం షాప్ తీయడానికి వచ్చిన సమయంలో షాప్ షెట్టర్ తాళాలు బద్దలుకొట్టినట్లు గమనించాడు. ఈ విషయమై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-08-27T16:26:53+05:30 IST