Kurnool: జలాశయాలకు భారీగా వరద నీరు

ABN , First Publish Date - 2022-08-07T04:28:10+05:30 IST

జిల్లాలో జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరదనీరు కొనసాగుతోంది..

Kurnool: జలాశయాలకు భారీగా వరద నీరు

కర్నూలు: జిల్లాలో జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరదనీరు కొనసాగుతోంది. దీంతో అధికారులు జలాశయం గేటు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. డ్యామ్ ఇన్ ఫ్లో 1 లక్షా 35 వేల 555 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 91 వేల 414  క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.70 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 213.8824 టీఎంసీలు ఉంది. మరోవైపు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 


అటు తుంగభద్ర జలాశయానికి వరద  ప్రవాహం కొనసాగుతోంది. 28 గేట్ల ద్వారా దిగవకు నీటి విడదల చేశారు. పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం1632.05గా ఉంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 62411 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 73437 క్యూ సెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 101.974 టీఎంసీలు ఉంది. 


Updated Date - 2022-08-07T04:28:10+05:30 IST