కురుమూర్తికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2020-12-01T03:24:59+05:30 IST

కురుమూర్తి వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది.

కురుమూర్తికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

చిన్నచింతకుంట, నవంబరు 30: కురుమూర్తి వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. రెండు రోజుల కిత్రం స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిసినా రద్దీ మాత్రం తగ్గడం లేదు. కొవిడ్‌ నిబంధనల కారణంగా జాతర మైదా నంలో ఎలాంటి దుకాణాలు వేయరాదని అధికారులు వ్యాపారులకు సూచించారు. కానీ వ్యాపారులు అధికారుల మాటలను పట్టించుకోలేదు. ఇంకా 15 నుంచి 20 రోజులపాటు జాతర ఉంటుందని, కనీసం ఈ రోజుల్లోనైనా తమ వ్యాపారాలు చేసుకుంటామని ఒక్కొక్కరు దుకాణాలను వేసుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల ముందే ఎలాంటి నిబంధనలు విధించకుండా ఉంటే, కనీసం వ్యాపారాలు చేసుకునేవారమని మిగతా వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.  


Updated Date - 2020-12-01T03:24:59+05:30 IST