64 ఏళ్ల వృద్ధుడి యాక్సిడెంట్ కేసు.. క్రికెటర్కు బెయిలు
ABN , First Publish Date - 2020-07-07T04:29:34+05:30 IST
64 ఏళ్ల వృద్ధుడిని కారుతో ఢీకొట్టిన కేసులో శ్రీలంక క్రికెటర్ కుశాల్ మెండిస్కు బెయిలు మంజూరయింది.
కొలంబో: 64 ఏళ్ల వృద్ధుడిని కారుతో ఢీకొట్టిన కేసులో శ్రీలంక క్రికెటర్ కుశాల్ మెండిస్కు బెయిలు మంజూరయింది. ఈ యాక్సిడెంట్లో బైక్పై వెళ్తున్న ఆ వృద్ధుడు మరణించాడు. కుశాల్ నడుపుతున్న ఎస్యూవీ కారు.. రోడ్డుపై వెళ్తున్న ఓ సైకిల్ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఆగని కుశాల్.. కారుతో సహా పరారయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో కుశాల్పై హిట్ అండ్ రన్ కేసు నమోదయింది. ఈ కేసు విచారణ సమయంలో పనాదురా అడిషనల్ మేజిస్ట్రేట్ కుశాల్కు బెయలు మంజూరుచేశారు. దీనికోసం రూ.4లక్షల విలువైన రెండు ఆస్తులను పూచికత్తుగా ఉంచాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. అలాగే మృతుడి కుటుంబానికి కూడా రూ.4లక్షలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పారు.