బూస్టర్ డోసు అంశంపై దృష్టిపెట్టిన కువైత్.. ప్రయాణికులు అక్కడ అడుగుపెట్టాలంటే..

ABN , First Publish Date - 2021-12-14T15:54:55+05:30 IST

దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా వేరియంట్ ఒమైక్రాన్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అంతకుముందు వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో.. యావత్ ప్రపంచం అలర్ట్ అయింది. ప

బూస్టర్ డోసు అంశంపై దృష్టిపెట్టిన కువైత్.. ప్రయాణికులు అక్కడ అడుగుపెట్టాలంటే..

ఎన్నారై డెస్క్: దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా వేరియంట్ ఒమైక్రాన్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అంతకుముందు వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో.. యావత్ ప్రపంచం అలర్ట్ అయింది. పలు దేశాలు కరోనా ఆంక్షలను తిరిగి కఠినంగా అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కువైత్ బూస్టర్ డోసు అంశాన్ని పరిశీలిస్తోంది. విదేశాలకు వెళ్లే కువైత్ సిటిజన్లు, నివాసితులకు బూస్టర్ డోసు తప్పనిసరి చేసే అంశంపై కువైత్ దృష్టిసారించినట్టు సమాచారం. అంతేకాకుండా ఇతర దేశాల నుంచి కువైత్‌కు వచ్చే నివాసితులు, ప్రయాణికులకు కూడా బూస్టర్ డోసు తప్పనిసరి చేసే విషయంపై నిపుణులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కువైత్ ప్రభుత్వం ఒకవేళ బూస్టర్ డోసును తప్పనిసరి చేస్తే.. భారత్ నుంచి కువైత్ వెళ్లే ప్రయాణికులు బూస్టర్ డోసు తీసుకుంటేనే ఆ దేశంలో అడుగుపెట్టడానికి వీలవుతుంది.  




Updated Date - 2021-12-14T15:54:55+05:30 IST