రైతులకు అందుబాటులోకి ల్యాబ్: జేడీఏ
ABN , First Publish Date - 2021-06-20T06:20:13+05:30 IST
రైతుల వ్యవసాయ భూసార పరీక్షలు, మట్టినమూ నాల పరీక్షలు చేయడానికి అందుబాటులోకి ల్యాబ్ను ఏర్పాటు చేస్తున్నట్టు జేడీఏ రామక్రిష్ణ తెలిపారు.
కొత్తచెరువు,జూన 19: రైతుల వ్యవసాయ భూసార పరీక్షలు, మట్టినమూ నాల పరీక్షలు చేయడానికి అందుబాటులోకి ల్యాబ్ను ఏర్పాటు చేస్తున్నట్టు జేడీఏ రామక్రిష్ణ తెలిపారు. శనివారం కొత్తచెరువులోని మార్కె ట్యార్డ్లో జరుగుతున్న అగ్రికల్చర్ల్యాబ్ గౌడౌన పనులను స్థానిక ఏఓనటరాజ్తో కలిసి పరిశీలించారు. రైతులకు పరీక్షలు చేయాలంటే జిల్లా కేంద్రానికి పంపా ల్సిన గతంలో ఉండేదని, అయితే నేడు వారికి అందుబాటులోకిఈ ల్యాబ్ను ఏర్పా టు చేస్తున్నామన్నారు. భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తీ చేయాలని కాం ట్రాక్టర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయసలహా సంఘం మండల అధ్యక్షుడు శ్యాంసుందర్రెడ్డి, వ్యవసాయసిబ్బంది పాల్గొన్నారు.