అర్బన్‌ లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపు

ABN , First Publish Date - 2021-04-24T05:24:12+05:30 IST

అర్బన్‌ లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపు

అర్బన్‌ లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపు
లబ్ధిదారులకు ప్లాట్లను చూపిస్తున్న తహసీల్దార్‌ సాయి శ్రీనివాస్‌

విజయవాడ రూరల్‌, ఏప్రిల్‌ 23 :  నున్నలో సేకరించిన భూములలో విజయవాడ అర్బన్‌కు చెందిన లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టినట్లు తహసీల్దార్‌ బీ సాయి శ్రీనివాస్‌ నాయక్‌ తెలిపారు. అర్బన్‌కు చెందిన లబ్ధిదారులకు శుక్రవారం ప్లాట్లను ఆయన చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నున్నలో అర్బన్‌ మండలానికి చెందిన 4,149 మందిని తొలి విడతలో ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌ ముగియడంతో లబ్ధిదారులకు ప్లాట్లను చూపిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ప్లాట్ల జియో ట్యాగింగ్‌ ప్రక్రియను కూడా పూర్తి చేశామని ఆయన వివరించారు.

Updated Date - 2021-04-24T05:24:12+05:30 IST