లబ్ధిదారులందరికీ ఓటీఎస్‌ పత్రాలు అందిస్తాం

ABN , First Publish Date - 2022-05-28T05:23:03+05:30 IST

ఓటీఎస్‌ పథకంలో లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందేలా చర్యలు చేపట్టామని కనిగిరి రెవెన్యూ డివిజనల్‌ అధికారి కె.సందీప్‌ పేర్కొన్నారు.

లబ్ధిదారులందరికీ ఓటీఎస్‌ పత్రాలు అందిస్తాం

ఆర్డీవో సందీప్‌

దొనకొండ, మే 27 : ఓటీఎస్‌ పథకంలో లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందేలా చర్యలు చేపట్టామని కనిగిరి రెవెన్యూ డివిజనల్‌ అధికారి కె.సందీప్‌ పేర్కొన్నారు. శుక్రవా రం ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించారు.  ముం దుగా పౌరసర ఫరాల శాఖ గిడ్డంగిని తనిఖీ చేసి ఎక్కడి నుంచి ఎన్నిరకాల సరుకులు చేరుతున్నాయో తెలుసుకు న్నారు. ఇక్కడ నుంచి ఎన్ని మండలాలకు సరఫరా చేస్తున్నా రు. గిడ్డంగిలో ప్రస్తుతం ఎంత స్టాకు ఉందో వాటి వివరాలు,  రికార్డులను ఆర్డీవో పరిశీలించారు. అనంతరం బాధాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న లేఅవు ట్‌ను పరిశీలించి అందుకు సంబంధించిన పూర్తి వివరాలు  తెలు సుకున్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల స మా వేశంలో ఆర్డీవో సందీప్‌ మాట్లాడుతూ సమస్యలపై ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేదని కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్‌ రూంను ఏర్పాటు  చేసినట్లు తెలిపారు. ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం 08402294296 ఫోన్‌చేస్తే  పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం రెవె న్యూ, గృహ నిర్మాణ, వైకేపీ శాఖలకు చెందిన అధికా రులు, సిబ్బందితో సమావేశం నిర్వహిం చారు.  తహసీల్దార్‌ ఎస్‌.రాధాకృష్ణ, ఆర్‌ఐ నాగార్జునరెడ్డి, సర్వేయర్‌ దర్శన్‌, వైకేపీ ఏపీఎం వెంకటేశ్వరరావు, వీఆర్వోలు పిచ్చిరెడ్డి, హరినారా యణ పాల్గొన్నారు.  


Updated Date - 2022-05-28T05:23:03+05:30 IST