మహిళాభివృద్ధికి ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2021-10-18T06:00:26+05:30 IST

మహిళాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ అన్నారు. ఆదివారం పోలేకుర్రులో వైసీపీ మండల కన్వీనర్‌ కాదా గోవిందకుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన వైఎస్‌ఆర్‌ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

మహిళాభివృద్ధికి ప్రభుత్వం కృషి

తాళ్లరేవు, అక్టోబరు 17: మహిళాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ అన్నారు. ఆదివారం పోలేకుర్రులో వైసీపీ మండల కన్వీనర్‌ కాదా గోవిందకుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన వైఎస్‌ఆర్‌ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మండలంలో 1461 స్వయం సహయక సంఘాలకు రూ.10.75కోట్ల ఆసరా చెక్కును అం దించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పి.విజయథామస్‌, నియోజకవర్గ ప్రత్యేకాధికారి సుబ్బలక్ష్మి, ఏరియా కోఆర్డినేటర్‌ అశోక్‌భరత్‌, ఎంపీపీ రాయుడు సునీతగంగాధర్‌, జడ్పీటీసీ దొమ్మేటి శామ్యూల్‌సాగర్‌, మండల సమాఖ్య అధ్యక్షురాలు వినకోటి లోవలక్ష్మి, వైసీపీ మండల మహిళా అధ్యక్షురాలు రేవు మల్లీశ్వరి, జడ్పీ మాజీ చైర్మన్‌ దున్నా జనార్ధనరావు, పోలేకుర్రు సర్పంచ్‌ వెంటపల్లి నూకరాజు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వైసీపీ నాయకులు, వీవోఏలు, మహిళలు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-18T06:00:26+05:30 IST