కదులుతున్న రైలులో అత్యాచార యత్నం.. ఎదురు తిరిగిన బాధితురాలిని రైలు నుంచి తోసేసి..

ABN , First Publish Date - 2022-05-06T05:39:15+05:30 IST

మధ్యప్రదేశ్‌కు చెందిన ఆ యువతి వారానికి ఒకసారి రైలులో తన స్వగ్రామానికి వెళుతుండేది.. గత శనివారం కూడా అలాగే రైలు ఎక్కింది.. భోగీ అంతా ఖాళీగా ఉంది.. మార్గ మధ్యంలో ఒక స్టేషన్‌లో ఒక యువకుడు రైలు ఎక్కాడు.. తిరిగి రైలు కదలగానే ఆమెపై వేధింపులకు దిగాడు.. ఆ యువతిపై అత్యాచార యత్నం చేశాడు..

కదులుతున్న రైలులో అత్యాచార యత్నం.. ఎదురు తిరిగిన బాధితురాలిని రైలు నుంచి తోసేసి..

మధ్యప్రదేశ్‌కు చెందిన ఆ యువతి వారానికి ఒకసారి రైలులో తన స్వగ్రామానికి వెళుతుండేది. గత శనివారం కూడా అలాగే రైలు ఎక్కింది. భోగీ అంతా ఖాళీగా ఉంది. మార్గ మధ్యంలో ఒక స్టేషన్‌లో ఒక యువకుడు రైలు ఎక్కాడు.. తిరిగి రైలు కదలగానే ఆమెపై వేధింపులకు దిగాడు.. ఆ యువతిపై అత్యాచార యత్నం చేశాడు.. దీంతో ఆ యువతి ఆ యువకుడి చేయి కొరికేసింది.. దీంతో ఆ యువతిని అతను రైలు నుంచి కిందకు తోసేశాడు.. అపస్మారక స్థితిలో ఉన్న యువతిని స్థానికులు ఆస్పత్రిలో చేర్చి రక్షించారు. 


ఉత్తరప్రదేశ్‌లోని బండాకు చెందిన 25 ఏళ్ల బాధితురాలు బండే అనే ప్రాంతం నుంచి వారానికోసారి బాగేశ్వర్‌ధామ్‌కి రైలులో వెళ్తుంటుంది. గత శనివారం ఆమె తన ఇంటికి వెళ్లడానికి లలిత్‌పూర్-ఖజురహో రైలు ఎక్కింది. ఆ రైలులో బాధితురాలు ఎక్కిన భోగీ అంతా ఖాళీగా ఉంది. ఛతర్‌పూర్‌‌లో ఓ యువకుడు ఆ రైలు ఎక్కాడు. రైలు కదలగానే ఆమెపై వేధింపులకు దిగాడు. ఆ యువతిపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో ఆ యువతి ఆ యువకుడి చేయి కొరికేసింది. దీంతో అతని చేతి నుంచి రక్తస్రావం జరిగింది. 


తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితుడు బాధిత మహిళను కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేశాడు. తర్వాతి రోజు ఉదయం అపస్మార స్థితిలో ఉన్న ఆ యువతిని ఓ గ్రామస్థుడు చూసి ఆస్పత్రికి తరలించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 


Read more