శారదా నదిలో మహిళ మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2020-12-04T05:05:40+05:30 IST
మండలంలోని ఉమ్మలాడ శారదా నదిలో గురువారం మహిళ మృతదేహం లభ్యమైంది.
మునగపాక, డిసెంబరు 3 : మండలంలోని ఉమ్మలాడ శారదా నదిలో గురువారం మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు విచారణ జరపగా అనకాపల్లి గాంధీబొమ్మ వద్ద గల నాయీబ్రాహ్మణ వీధికి చెందిన మళ్లవరపు పార్వతి (50)గా గుర్తించారు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు. వారికి వివాహం కావడంతో వేరే గ్రామాల్లో ఉంటున్నారు. పార్వతికి ఆమె కుమార్తె మంగళవారం ఫోన్ చేయగా, ఎత్తకపోవడంతో సమీప కుటుంబ సభ్యులను వాకపు చేశారు. దీంతో వారంతా ఆమె కోసం వెతకడం ప్రారంభించగా, గురువారం మధ్యాహ్నం మృతదేహాన్ని శారదానదిలో కనుగొన్నారు. ఎస్ఐ జి.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.