HYD : లేడీ డాక్టర్ మృతి.. కాలనీవాసుల్లో కలవరం..

ABN , First Publish Date - 2021-09-06T15:01:23+05:30 IST

పది రోజులుగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొంది సురక్షితంగా బయటపడ్డారు..

HYD : లేడీ డాక్టర్ మృతి.. కాలనీవాసుల్లో కలవరం..

హైదరాబాద్ సిటీ/పేట్‌బషీరాబాద్‌ : డెంగీ వ్యాధి బారిన పడి ఓ వైద్యురాలు మృతి చెందింది. జీడిమెట్ల డివిజన్‌ మీనాక్షీ కాలనీకి చెందిన డాక్టర్‌ అర్పితారెడ్డి (32)కి వారం రోజుల క్రితం జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు డెంగీగా నిర్ధారించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. అదే కాలనీకి చెందిన జార్సీరాణి డెంగీతో పది రోజులుగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొంది సురక్షితంగా బయటపడ్డారు. మరో మహిళ సౌమ్య అత్యవసర వైద్య చికిత్స పొందుతున్నారు. ఒకే కాలనీకి చెందిన ముగ్గురు వేర్వేరు కుటుంబాల మహిళలు డెంగీ బారిన పడడం, ఒకరు మృతి చెందడంతో మీనాక్షీ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-09-06T15:01:23+05:30 IST