వరుస పేలుళ్లతో వణికిపోయిన పాక్
ABN , First Publish Date - 2022-01-20T22:02:39+05:30 IST
లాహోర్: వరుస పేలుళ్లతో పాకిస్థాన్ వణికిపోయింది. లాహోర్ అనార్కలీ మార్కెట్లో జరిగిన వరుస పేలుళ్లలో ఐదుగురు చనిపోయారు.
లాహోర్: వరుస పేలుళ్లతో పాకిస్థాన్ వణికిపోయింది. లాహోర్ అనార్కలీ మార్కెట్లో జరిగిన వరుస పేలుళ్లలో ఐదుగురు చనిపోయారు. 24 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.ఒక్కసారిగా జరిగిన ఘటనతో అంతా ఉలిక్కిపడ్డారు. పేలుళ్ల ధాటికి మార్కెట్లో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాడికి తామే బాధ్యులమని బలోచ్ నేషనల్ ఆర్మీ ప్రకటించుకుంది.