లఖీంపుర్ ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టు జోక్యం
ABN , First Publish Date - 2021-10-07T03:14:10+05:30 IST
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లఖీంపుర్ ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. గురువారం ఉదయం 11 గంటలకు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు వింటుంది.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లఖీంపుర్ ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. గురువారం ఉదయం 11 గంటలకు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు వింటుంది. అక్టోబర్ మూడున లఖీంపుర్ ఖేరీలో ఆందోళన చేస్తున్న రైతులను వాహనం ఢీ కొట్టడంతో నలుగురు రైతులు చనిపోయారు. ఆందోళనకారులు ప్రతిదాడి జరిపి ముగ్గురు బీజేపీ కార్యకర్తలను, ఒక విలేకరిని కొట్టి చంపారు. రైతులను వాహనంతో ఢీ కొట్టిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. రాజకీయ పార్టీలు ఆందోళన ఉధృతం చేశాయి. దీనిపై నేరుగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. లఖీంపుర్ ఖేరీ ఘటనకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిశ్ మిశ్రా కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి.