భారత్‌లో కరోనా కేసులు లేని ఏకైక ప్రాంతం ఇదే..

ABN , First Publish Date - 2020-07-07T00:54:24+05:30 IST

కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన మూడో దేశంగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే 7లక్షల వరకు ...

భారత్‌లో కరోనా కేసులు లేని ఏకైక ప్రాంతం ఇదే..

కవరత్తి: కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన మూడో దేశంగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే 7లక్షల వరకు కరోనా బాధితులను దేశవ్యాప్తంగా గుర్తించారు. అయితే కరోనా మొదలైనప్పటి నుంచీ ఇప్పటివరకు భారత్‌కు చెందిన ఓ ప్రాంతంలో మాత్రం ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. నమ్మశక్యంగా లేదా..? నిజమండీ బాబు.. కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో ఇప్పటివరకు ఒక్క కోవిడ్-19 కేసు కూడా అధికారికంగా నమోదు కాలేదు. ఈ స్థాయిలో కరోనా ప్రభావం నుంచి తప్పించుకోవడానికి గల కారణాలను కవరత్తి అతనపు కలెక్టర్ టీ కాసిం మాటల్లోనే తెలుసుకుందాం. ‘లక్షద్వీప్‌లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదవకపోవడం ఎంతో సంతోషాన్నిస్తోంది. దీనికోసం మేము కొన్ని నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నాం.


లక్షద్వీప్‌కు చెందిన స్థానికులను మాత్రమే ఇతర ప్రాంతాలనుంచి వచ్చేందుకు అనుమతిస్తున్నాం. అది కూడా కరోనా నెగెటివ్‌గా తేలిన వారిని మాత్రమే రానిస్తున్నాం. అలా వచ్చిన వారిని కూడా 14 రోజుల పాటు పూర్తిస్థాయి పర్యవేక్షణలో ఉంచుతున్నాం. ఇప్పటికే పర్యాటకులను కేంద్రం నిషేధించింది. ఈ నేపథ్యంలో మేం తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయ’ని చెప్పారు. అంతేకాకుండా జనాభా కూడా తక్కువగా ఉండడం వల్ల కరోనా నుంచి తప్పించుకోగలిగామని కాసిం పేర్కొన్నారు.

Updated Date - 2020-07-07T00:54:24+05:30 IST