వైభవంగా లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2022-10-08T05:59:26+05:30 IST
సిరిసిల్లలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం ఆలయంలో హోమం నిర్వహించిన అనంతరం స్వామివారిని సూర్యవాహనంపై ఊరేగించారు.
సిరిసిల్ల ఎడ్యుకేషన్, అక్టోబరు 7: సిరిసిల్లలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం ఆలయంలో హోమం నిర్వహించిన అనంతరం స్వామివారిని సూర్యవాహనంపై ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలు పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని కాలింగమర్ధనముపై పురవీధుల గుండా ఊరేగించారు. రాత్రి ఆలయంలో హోమం నిర్వహించిన తర్వాత చంద్రవాహనంపై శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయంలో సుందరకాండ, విష్ణుసహస్రనామ స్తోత్రం, భగవద్గీత, శ్రీ సుదర్శన శతకం, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణము చేశారు. ఆలయ అధ్యక్షుడు ఉప్పుల విఠల్రెడ్డి, ధర్మకర్తలు మేర్గు లక్ష్మణ్, మామిడాల రమణ, కత్తెర సంతోషిణి, కోడం శ్రీనివాస్, అల్లాడి సరస్వతి, ఎక్స్ అఫీషియోమెంబర్ సీహెచ్ రాంమోహనాచారి, కార్యనిర్వహణాధికారి మారుతిరావు పాల్గొన్నారు.