వైభవంగా శోభనాచల స్వామి శాంతి కల్యాణం
ABN , First Publish Date - 2022-08-11T05:52:08+05:30 IST
స్థానిక శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పవిత్రోత్సవాలలో భాగంగా బుధవారం భూనీల సమేత శోభనాచల స్వామి శాంతి క్యాణం వైభవంగా జరిగింది.
ఆగిరిపల్లి, ఆగస్టు 10 : స్థానిక శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పవిత్రోత్సవాలలో భాగంగా బుధవారం భూనీల సమేత శోభనాచల స్వామి శాంతి క్యాణం వైభవంగా జరిగింది. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలో ఉదయం స్వామికి విశేష అర్చన, నిత్యహోమాలు, మూల మంత్ర శాంతిహోమాలు నిర్వహించారు. అనంతరం పవిత్రాల విసర్జన, మహా పూర్ణాహుతి చేశారు. కల్యాణం అనంతరం ఉభయదాతల ఆశీర్వచనం, పవిత్రాల వితరణ చేశారు. ఆలయ అర్చకులు వేదాంతం శేషుబాబు, జి. అనంత కృష్ణ ఉత్సవాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
వేద పండితులకు సత్కారం
స్థానిక లక్ష్మీనరసింహ వేదశాస్త్ర పాఠశాలలో ఈనెల 8,9 తేదీలలో జరిగిన చతుశ్శాస్త్ర ధర్మోపన్యాస సభలను పురస్కరించుకుని వేద పండితులను సత్కరించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్, ఇన్కం టాక్స్ డీజీ పి.రఘు, ద్వారకాతిరుమల విశ్రాంత ఈవో ఎం.వి.ఎస్.ఎస్.విష్ణు ప్రసాద్ ముఖ్యఅతిథులుగా హాజరై వేదపండితులను సత్కరించారు.