కన్నులపండువగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
ABN , First Publish Date - 2021-02-25T06:14:43+05:30 IST
అక్కకొండ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరు గుతున్నాయి.
కడెం, ఫిబ్రవరి 24 : అక్కకొండ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరు గుతున్నాయి. బుధవారం స్వామివారి కల్యాణం కమనీయంగా ఆలయకమిటీ నిర్వ హించింది భక్తులు కన్నులపండువగా కల్యాణాన్ని తిలకించారు. మునుపెన్నడూ లేని విధంగా భక్తులరద్దీ పెరిగింది. ప్రతీ ఏటా ఆలయకమిటీ అభివృద్ధి కార్యక్రమాలు, విస్తృత ప్రచారంతో ఏటా భక్తులసంఖ్య పెరిగిపోతుంది. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం జరిపించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయకమిటీ అన్ని వస తులు కల్పించారు. శ్రీ అక్కకొండ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణానికి మాజీ ఎంపీ రమేష్రాథోడ్ హాజరయ్యారు. ఆయనకు ఆలయకమిటీ ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి, కల్యాణాన్ని ప్రారంభించారు. అలాగే ఆలయకమిటీ ప్రచురించిన క్యాలెండర్ ఆవిష్కరించారు. హాజరైన భక్తులతో కల్యాణాన్ని తిలకించారు. అనంతరం ఆలయ కమిటీ ఆయనను ఘనంగా సన్మా నించారు. కల్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రాపర్తి లక్ష్మణ్, సర్పంచ్లు అగునూరి గంగన్న, రాజిరెడ్డి, ఎంపీటీసీ రమేష్, నాయకులు గోస్కుల మల్లేష్, కోలాశ్రీనివాస్, కొప్పుల లక్ష్మణ్, తది తరులు పాల్గొన్నారు.