ఘనంగా లలితా యాగం

ABN , First Publish Date - 2021-06-24T05:13:08+05:30 IST

నెల్లూరు ఉస్మాన్‌సాహెబ్‌పేటలో కుర్తాళం పీఠం అర్చకుడు మాచవోలు రమేష్‌శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ లలితాయాగం మూడోరోజు బుధవారం ఘనంగా జరిగింది.

ఘనంగా లలితా యాగం

నెల్లూరు(సాంస్కృతికం), జూన్‌ 23 : నెల్లూరు ఉస్మాన్‌సాహెబ్‌పేటలో కుర్తాళం పీఠం అర్చకుడు మాచవోలు రమేష్‌శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ లలితాయాగం మూడోరోజు బుధవారం ఘనంగా జరిగింది. లోక కల్యాణార్థం, కరోనా మహమ్మారి నుంచి ప్రజలు అందరూ బయటపడాలన్న సంకల్పంతో ఈ యాగం జరుగుతోంది. ఇప్పటి వరకు 823 లలితాదేవి నామాలతో హోమం జరిగింది. ఈ సందర్భంగా విశేష పూజలు జరిపారు. యాగం ముగింపు సందర్భంగా గురువారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మహా పూర్ణా హుతి, సాయంత్రం 6.30గంటల నుంచి లలితా కామేశ్వరస్వామి కల్యాణోత్సవం జరుగుతుందని మాచవోలు రమేష్‌ శర్మ తెలిపారు. భక్తులందరూ యూట్యూబ్‌ లైవ్‌లో తిలకించవచ్చని తెలిపారు. 

Updated Date - 2021-06-24T05:13:08+05:30 IST