ఐసీయూలో Lalu Prasad Yadav

ABN , First Publish Date - 2022-07-04T23:30:17+05:30 IST

ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారంనాడు అస్వస్థతకు...

ఐసీయూలో Lalu Prasad Yadav

పాట్నా: ఆర్జేడీ (RJD) అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారంనాడు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. దీనికి కొద్ది గంటల ముందే లాలూ ప్రసాద్ యాదవ్ పాట్నాలోని రబ్రీదేవి నివాసంలో ఇంట్లో మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డారు. దీంతో ఆయన భుజం విరగడంతో పాటు, వెన్నెముకకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు ఆసుపత్రి అధికారి ఒకరు తెలిపారు. కిడ్నీ సమస్యలతో పాటు భుజానికి గాయం కావడం, ఇతర సమస్యలతో ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చినట్టు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సి ఉంటుందా అనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు.


కాగా, ఆసుపత్రిలో లాలూ వెంట ఆయన భార్య రబ్రీదేవి, కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ ఉన్నారు. మాజీ సీఎంగా రబ్రీదేవికి కేటాయించిన నివాసంలో ఉంటున్న లాలూ ఆదివారం మెట్లు ఎక్కుతూ జారిపడ్డారు. దాంతో ఆయన కుడి భుజం విరిగింది. పశుగ్రాసం కుంభకోణంలో ప్రస్తుతం లాలూ బెయిలుపై ఉన్నారు. కిడ్నా మార్పిడి కోసం సింగపూర్ వెళ్లేందుకు జార్ఖాండ్ హైకోర్టు అనుమతించడంతో ఆయనకు బెయిల్ లభించింది.

Updated Date - 2022-07-04T23:30:17+05:30 IST