బీజేపీ సర్కారుపై Lalu Prasad Yadav ఘాటు విమర్శలు

ABN , First Publish Date - 2022-06-06T17:34:19+05:30 IST

బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డారు.....

బీజేపీ సర్కారుపై Lalu Prasad Yadav ఘాటు విమర్శలు

పాట్నా(బీహార్): బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. దేశం అంతర్యుద్ధం దిశగా పయనిస్తోందని,ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా ప్రజలు ఏకం కావాలని బీహార్ మాజీ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.‘‘బీజేపీ పని చేస్తున్న తీరు వల్ల దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని నేను ప్రజలకు పిలుపునిస్తున్నాను’’ అని లాలూ చెప్పారు. దేశంలో లౌకిక శక్తులు ఏకమై కలిసి పోరాడాలని కూడా లాలూ విజ్ఞప్తి చేశారు.సోషలిస్టు అయిన నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం నాగ్‌పూర్ ఎజెండా ప్రకారం నడుస్తోందని యాదవ్ అన్నారు. తనకు వ్యతిరేకంగా అన్ని దర్యాప్తు సంస్థలను వినియోగించి నప్పటికీ భయపడనని లాలూ ప్రసాద్‌ చెప్పారు.


Updated Date - 2022-06-06T17:34:19+05:30 IST