శ్రీకాకుళం జిల్లాలో రాజుకున్న భూవివాదం
ABN , First Publish Date - 2022-03-22T13:17:06+05:30 IST
ఆముదాలవలస పెద్దజొన్నవలసలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెద్దజొన్నవలసలో భూవివాదంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
శ్రీకాకుళం: జిల్లాలోని ఆముదాలవలస పెద్దజొన్నవలస గ్రామంలో భూవివాదం రాజుకుంది. భూవివాదంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దాంతో పెద్దజొన్నవలస గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. భూ వివాదంలో సర్పంచ్ అనుచరులు కత్తులు, కర్రలతో జగపతి అనే వ్యక్తి ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. గాయాలయిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.