నిరుపేదలకు భూములు ఇవ్వాలి
ABN , First Publish Date - 2021-02-26T05:29:48+05:30 IST
మండల పరిధిలోని ముుదివర్తిలో భూములు లేని నిరుపేదలకు భూములను ఇవ్వాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ ప్రభాకర్ తెలిపారు.
విడవలూరు పిబ్రవరి 25: మండల పరిధిలోని ముుదివర్తిలో భూములు లేని నిరుపేదలకు భూములను ఇవ్వాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ ప్రభాకర్ తెలిపారు. ముదివర్తిలో సీపీఐ ఆధ్వర్యంలో భూపోరాటంలో భాగంగా గురువారం ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని ఆ పార్టీ సీనియర్ నాయకుడు తిక్కవరపు గోపాల్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పెన్నా తీరంలో ఉన్న భూముల్లో జెండాలను పాతారు. ఈ క్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామంలో సెంటు భూమి లేక వందలాది మంది ఉన్నారన్నారు. అటువంటి వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. సీపీఐ ప్రతి పేదవాడికి అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు నందిపోగు రమణయ్య, దమ్ము దుర్గాబాబు, సునీల్ ఆదినారాయణ, విజయ్కుమార్, వి. నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.