దేవదాయ భూములకు సబ్‌డివిజన్‌ చేయించాలి

ABN , First Publish Date - 2021-10-18T05:29:13+05:30 IST

నిషేధిత జాబితాలోని దేవదాయ భూములకు నిర్ధిష్టమైన సబ్‌డివిజన్‌ చేయించాలని, ఆయా సర్వే నెంబర్లలోని మిగిలిన భూమిని క్రయ విక్రయాలు జరుపుకొనుటకు అనుమతి ఇప్పించాలని రాష్ట్ర దేవ దాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు స్థానిక నాయకులు విజ్ఞప్తి చేసారు.

దేవదాయ భూములకు సబ్‌డివిజన్‌ చేయించాలి

దివాన్‌చెరువు, అక్టోబరు 17: నిషేధిత జాబితాలోని దేవదాయ భూములకు నిర్ధిష్టమైన సబ్‌డివిజన్‌ చేయించాలని, ఆయా సర్వే నెంబర్లలోని మిగిలిన భూమిని క్రయ విక్రయాలు జరుపుకొనుటకు అనుమతి ఇప్పించాలని రాష్ట్ర దేవ దాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు స్థానిక నాయకులు విజ్ఞప్తి చేసారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం దివాన్‌ చెరువులో కొద్దిసేపు ఆగిన మంత్రి శ్రీనివాస్‌ను వైసీపీ నాయకులు గంగిశెట్టి సోమేశ్వర రావు, నాళం రోశయ్య, వేమగిరి కృష్ణ, స్థానికుడు ఆశాకన్నా మోహన రావు తదితరులు కలసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. సర్వే నెంబరు భూమి పూరా విస్తీర్ణంలో కొంతభూమి దేవదాయభూమి అయితే పూరా విస్తీ ర్ణాన్ని నిషేధిత జాబితాలో చేర్చారని, ఈ కారణంగా మిగతాభూమి క్రయవి క్రయాలు జరుపుకునేందుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని వాపోయారు.

Updated Date - 2021-10-18T05:29:13+05:30 IST