‘భూకబ్జాలను ప్రశ్నిస్తే అలా ప్రవర్తిస్తారా?’

ABN , First Publish Date - 2022-06-28T22:21:24+05:30 IST

ధర్మవరం ఎమ్మెల్యే భూకబ్జాలను ప్రశ్నిస్తూ వుండగా విలేకరుల సమక్షంలోనే బీజేపీ నాయకుల మీద దాడి అమానుషమని బీజేపీ నేత లంకా దినకర్ మండిపడ్డారు.

‘భూకబ్జాలను ప్రశ్నిస్తే అలా ప్రవర్తిస్తారా?’

విజయవాడ: ధర్మవరం ఎమ్మెల్యే భూకబ్జాలను ప్రశ్నిస్తూ వుండగా విలేకరుల సమక్షంలోనే బీజేపీ నాయకుల మీద దాడి అమానుషమని బీజేపీ నేత లంకా దినకర్ మండిపడ్డారు. ధర్మవరంలో ఎమ్మెల్యే దౌర్జన్యాలను ఖండిస్తున్నామన్నారు. ప్రెస్ క్లబ్‌లో బీజేపీ నాయకుల పైన దాడి అమానవీయమన్నారు. వైసీపీ ఎమ్మెల్యే దాష్టికాలపైన విచారణ జరిపి శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రశ్నించిన బీజేపీ నాయకులపైన దాడి పిరికిపందల చర్య అన్నారు. రాష్ట్రంలో హింస, అరాచక జగనన్న పాలనకి చరమగీతం తప్పదన్నారు. 

Updated Date - 2022-06-28T22:21:24+05:30 IST