జగన్ సర్కార్పై లంకా దినకర్ సీరియస్
ABN , First Publish Date - 2021-11-08T21:53:47+05:30 IST
అమరావతి: జగన్ సర్కార్పై బీజేపీ నేత లంకా దినకర్ మండిపడ్డారు.
అమరావతి: జగన్ సర్కార్పై బీజేపీ నేత లంకా దినకర్ మండిపడ్డారు. పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్రో ధరలను కేంద్రం, కొన్ని రాష్ట్రాలు తగ్గించాయన్నారు. ఏపీ, బెంగాల్ రాష్ట్రాలు మాత్రం ప్రశాంత్ కిషోర్ సూచనలు మాత్రమే అమలు చేస్తున్నాయని విమర్శించారు. పెట్రో ధరలు తగ్గించాల్సిన అవసరం లేదని సీఎం జగన్ ప్రజా ధనంతో పేపర్లో ప్రకటన ఇస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. ప్రజలకు అర్థం కాకుండా పర్సంటేజీల పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. ఢిల్లీ చుట్టూ అప్పుల కోసం ప్రదక్షిణ చేసే జగన్.. ప్రజా ధనాన్ని ఇలా దుబారా చేస్తారా? అంటూ ప్రశ్నించారు. దేశంలో ఏపీలోనే ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ మాయలు, మోసాలతో పాలన సాగిస్తున్నారని లంకా దినకర్ విమర్శించారు.