చరిత్ర హీనుడుగా జగన్: లంకా దినకర్
ABN , First Publish Date - 2021-12-17T22:56:27+05:30 IST
రైతులు రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇస్తే, జగన్ వారికి లాఠీ దెబ్బలు రుచి చూపించారని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు.
అమరావతి: రైతులు రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇస్తే, జగన్ వారికి లాఠీ దెబ్బలు రుచి చూపించారని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. శుక్రవారం ఆయన తిరుపతి రైతు సభలో మాట్లాడారు. రాష్ట్రా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులతో న్యాయస్థానం నుంచి తిరుపతి దేవస్థానం వరకు కాళ్లతో నడిపించిన చరిత్ర హీనుడుగా జగన్ మిగిలారని మండిపడ్డారు. బిడ్డకు ఒక తల్లి సహజం, బిడ్డకు ముగ్గురు తల్లులు ఎలా అసహజమో, ఒక రాజధాని సహజం - మూడు రాజధానులు అసహజమని చెప్పారు. అమరావతి కోసం నేడు తిరుపతి సభా ఒక ముఖ్యమైన ఘట్టం, భవిష్యత్తులో విజయోత్సవ సభ కూడా తిరుపతి నుంచే జరుగుతోందని లంకా దినకర్ తెలిపారు.