లఖీంపూర్ ఖీరీ ఘటనలో రెండో చార్జిషీటు
ABN , First Publish Date - 2022-01-22T08:01:07+05:30 IST
ఉత్తరప్రదేశ్లో జరిగిన లఖీంపూర్ ఖీరీ ఘటనలో పోలీసులు రెండో చార్జిషీటు దాఖలు చేశారు. నిరుడు అక్టోబరు 3న రైతు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాచేస్తున్న రైతులపై నుంచి మూడు కార్లు దూసుకెళ్లడంతో..
న్యూఢిల్లీ, జనవరి 21: ఉత్తరప్రదేశ్లో జరిగిన లఖీంపూర్ ఖీరీ ఘటనలో పోలీసులు రెండో చార్జిషీటు దాఖలు చేశారు. నిరుడు అక్టోబరు 3న రైతు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాచేస్తున్న రైతులపై నుంచి మూడు కార్లు దూసుకెళ్లడంతో నలుగురు రైతులు, ఓ జర్నలిస్టు సహా ఎనిమిది మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఓ కారు డ్రైవరును రైతులు కొట్టి చంపారు. దీంతో ఏడుగురు రైతులను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. తాజాగా దాఖలు చేసిన చార్జిషీటులో ఆ రైతుల పేర్లను చేర్చారు.