లారీ దగ్ధం

ABN , First Publish Date - 2022-05-14T06:03:18+05:30 IST

జాతీయ రహదారి పక్కన నిలిపి ఉంచిన లారీని వేరొక లారీ బలంగా ఢీకొట్టడం తో మంటలు చెలరేగి, ఆగిఉన్న లారీ పూర్తిగా దగ్ధమైన ఘటన శుక్రవారం వేకువజామున చోటుచేసుకుంది.

లారీ దగ్ధం
మంటల్లో కాలిపోతున్న లారీ

  వెనుక నుంచి వేరే లారీ ఢీకొనడంతో చెలరేగిన మంటలు
  డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
బొండపల్లి, మే 13:
జాతీయ రహదారి పక్కన నిలిపి ఉంచిన లారీని వేరొక లారీ బలంగా ఢీకొట్టడం తో మంటలు చెలరేగి, ఆగిఉన్న లారీ పూర్తిగా దగ్ధమైన ఘటన శుక్రవారం వేకువజామున చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి బొండపల్లి ఎస్‌ఐ ఆర్‌.వాసుదేవ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం లోని తిరువేరంబూర్‌ తాలూకా నావలపట్టు గ్రామానికి చెందిన రాజా డేవిడ్‌ అనే వ్యక్తి తన లారీపై రాయపూ ర్‌ నుంచి విశాఖపట్టణానికి ఐరెన్‌ షీట్ల లోడుతో వెళు తూ గొట్లాం బైపాస్‌ రోడ్డుకు సమీపంలో లారీని నిలి పారు. అదే మార్గంలో వెళుతున్న మరొక ఐరెన్‌ షీట్‌తో వెళుతున్న లారీ బలంగా వెనుక నుంచి ఆగిఉన్న లారీ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ వెనుక ఉన్న గ్యాస్‌ సిలెండర్‌కు మంటలు వ్యాపించి క్రమంగా లారీ మొత్తం దగ్ధమయ్యింది. ఆ సమయంలో లారీ క్యాబిన్‌ లో డ్రైవర్‌ రాజాడేవిడ్‌ మంటల్లో చిక్కుకున్నాడు. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెళ్లి బయట కు తీశారు. 108 వాహనంలో విజయనగరంలోని మహ రాజ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అంది స్తున్నారు. గజపతినగరం సీఐ డి.రమేష్‌ ఘటనా స్థలా న్ని పరిశీలించి, ప్రమాదానికిగల కారణాలను తెలుసు కున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తు న్నారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని, మంటలను అదుపు చేశారు.
 

Read more