లారీ ఢీకొని మహిళ మృతి
ABN , First Publish Date - 2021-10-18T05:42:52+05:30 IST
రాజంపేట మండలం మన్నూరు ఆంజనేయస్వామి గుడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన లారీ ఢీకొనడంతో బండారు పద్మావతి(38) మృతి చెందినట్లు మన్నూరు ఎస్ఐ భక్తవత్సలం తెలిపా రు.
రాజంపేట టౌన్, అక్టోబరు 17 : రాజంపేట మండలం మన్నూరు ఆంజనేయస్వామి గుడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన లారీ ఢీకొనడంతో బండారు పద్మావతి(38) మృతి చెందినట్లు మన్నూరు ఎస్ఐ భక్తవత్సలం తెలిపా రు. ఆదివారం సాయంత్రం పెనగలూ రు మండలం వెలగచెర్ల నుంచి నందలూరుకు చిదంబరం, ఆయన భార్య పద్మావతి ఏపీ04బీఎక్స్6406 నెంబరు గల బైకుపై వెళుతుండగా రాజంపేట బైపాస్ రోడ్డుపై వారి మోటారు సైకిల్ను తిరుపతి నుంచి కడపకు వెళుతున్న ఏపీ04టీఎం 6210 నెంబరు గల లారీ వెనుకవైపు నుంచి ఢీకొంది. దీంతో పద్మావతి మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ఆమె భర్త చిదంబరం గాయపడినట్లు ఆయన వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు.